కారు నెంబర్ కోసం రూ.122 కోట్ల వేలం.. గిన్నిస్ రికార్డ్

కారు  నెంబర్ కోసం రూ.122 కోట్ల వేలం.. గిన్నిస్ రికార్డ్

టాప్ యాక్సెసరీలు, ఖరీదైన విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయడానికి కోట్ల రూపాయలను వెచ్చించే వ్యక్తులను మీరు చూసే ఉంటారు. తాము డ్రీమ్ కార్లను కొనడానికి కొంత మంది ఎంత డబ్బయినా ఖర్చు చేస్తారు. అదే తరహాలో ఓ వ్యక్తి తన కారు నంబర్ ప్లేట్‌పై ప్రపంచంలోనే ఎవరూ పెట్టనంత ఖర్చు పెట్టి రికార్డు సృష్టించాడు. ప్రపంచంలో కొందరు ఖరీదైన కార్లు కొనాలనే ఆసక్తితో ఉండటమే కాకుండా తమ కారు నంబర్ ప్లేట్ కోసం కోట్లలో చెల్లించేందుకు కూడా సిద్ధపడతారు. అలాంటి వారిలో ఈ వ్యక్తి కూడా ఒకరు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు నంబర్‌ ప్లేట్‌ను రూ.122 కోట్లకు విక్రయించి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఈ ఘటన ఏప్రిల్ 8న చోటుచేసుకుంది.

దుబాయ్‌లో జరిగిన 'మోస్ట్ నోబుల్ నంబర్స్' ఛారిటీ వేలంలో VIP నంబర్ ప్లేట్ 'P 7' రికార్డు స్థాయిలో 55 మిలియన్ దిర్హామ్‌లకు (సుమారు ₹122.6 కోట్లు) విక్రయించబడింది. ఈ ఈవెంట్‌ను ఎమిరేట్స్ వేలం నిర్వహించింది. 'వన్ బిలియన్ మీల్స్' ఈ క్యాంపెయిన్ కు మద్దతుగా నిలిచింది.

'P 7' కారు నంబర్ ప్లేట్ కోసం వేలం పాట 15 మిలియన్ AED వద్ద ప్రారంభమైంది. సెకన్లలోనే ఈ బిడ్డింగ్ 30 మిలియన్ AEDని దాటింది. టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు, యజమాని అయిన ఫ్రెంచ్ ఎమిరాటీ వ్యాపారవేత్త పావెల్ వాలెరివిచ్ డ్యూరోవ్ 35 మిలియన్ AED తో వేలం వేశారు. ఆ  తర్వాత ఒక దశలో బిడ్డింగ్ కొంతసేపు ఆగిపోయి, చివరికి బిడ్డింగ్ 55 మిలియన్ దిర్హామ్‌ల వద్ద ముగిసింది. అయితే నంబర్ ప్లేలో ఎవరు గెలిచారనేది మాత్రం తెలియరాలేదు.

జుమేరాలోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక ఇతర VIP నంబర్ ప్లేట్లు, ఫోన్ నంబర్‌లు కూడా వేలం వేయబడ్డాయి. వేలం నుంచి సుమారు 100 మిలియన్ దిర్హామ్‌లు ($27 మిలియన్లు) కలెక్ట్ చేశారు. దీన్ని రంజాన్ సందర్భంగా ప్రజలకు ఆహారం ఇచ్చేందుకు ఉపయోగించనున్నారు. కార్ ప్లేట్లు,  ప్రత్యేకమైన మొబైల్ నంబర్ల వేలంతో కలిపి మొత్తం 97.92 మిలియన్ దిర్హామ్‌లను వసూలు చేసింది. 

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు..

2008లో ఒక వ్యాపారవేత్త అబుదాబి నంబర్ 1 ప్లేట్‌ను AED 52.22 మిలియన్లకు బిడ్ చేసినప్పుడు ఇప్పటికే ఉన్న రికార్డును అధిగమించాలని చాలా మంది బిడ్డర్లు కోరుకున్నారు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బు మొత్తం ప్రపంచంలో ఆకలిని ఎదుర్కోవాలనే లక్ష్యంతో స్థాపించబడిన 'వన్ బిలియన్ మీల్స్' ప్రచారానికి అందజేయబడుతుంది. రంజాన్ స్ఫూర్తికి అనుగుణంగా వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఈ విరాళాన్ని అందించారు.