
కామారెడ్డి, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన వడ్లు మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గాంధారి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు సెంటర్ ను పరిశీలించి, కలెక్టర్ మాట్లాడారు. ఆకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులకు టార్పాలిన్లు ఇవ్వాలన్నారు.
పైపులైన్ పనులు స్పీడప్ చేయాలి
మిషన్ భగీరథ పైపులైన్ వర్క్స్ స్పీడప్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో రివ్యూ మీటింగ్లో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా ఆర్గుల్ నుంచి కామారెడ్డికి నీటి ని సప్లయ్ చేసే మెయిన్ పైపులైన్ 14 కి.మీ పనులు పూర్తి చేయాలన్నారు. కామారెడ్డి టౌన్లో సప్లయ్ చేస్తున్న నీటి వివరాలను ప్రతి రోజు అందించాలన్నారు. పట్టణంలో ఇంకుడు గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి ..
మద్దెల చెరువు నుంచి పిట్లం వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను స్పీడప్ చేయాలని ఆర్అండ్బీ అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. ఆర్అండ్బీ, ఫారెస్టు అధికారులతో రోడ్డు పనులపై కలెక్టర్ రివ్యూ చేశారు. ఫారెస్టు ఏరియాలో చెట్ల నరికివేతకు సంబంధిత శాఖ పర్మిషన్ తీసుకోవాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయండి..
పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా శుక్రవారం బిచ్కుంద మండల కేంద్రంలోని జయశ్రీ ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. కూలీ పని చేసుకుంటూ జీవించే తమ కుటుంబం రేకుల షేడ్డులో నివసిస్తుందని జయశ్రీ కలెక్టర్తో పేర్కొన్నారు. తమకు ఇల్లు మంజూరు చేస్తే నిర్మించుకుంటామని తెలిపారు.
ఆయా కార్యక్రమాల్లో సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్, అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, మిషన్ భగీరథ ఎస్ఈ రాజేంద్రకుమార్, ఈఈ నరేష్, డీఎస్వో మల్లికార్జునబాబు, డీసీవో రాంమోహన్, ఆర్డీవో వీణ, ఆర్అండ్బీ ఈఈ రవిశంకర్, ఎఫ్డీవో రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, ఏఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు.