పొద్దున్నే కలెక్టర్​ తలుపు కొట్టాడు.. ఎందుకంటే..

పొద్దున్నే కలెక్టర్​ తలుపు కొట్టాడు.. ఎందుకంటే..

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్​ హనుమంతరావు విద్యార్థులను చైతన్యపర్చే కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. సంస్థాన్​ నారాయణపురం మండలంలోని కంకణల గూడెం పదోతరగతి విద్యార్థి ఇంటికి  కలెక్టర్ హనుమంతరావు ఉదయం 5 గంటలకు వెళ్లి తలుపు కొట్టారు.  అనంతరం భరత్​ చంద్ర అంటూ పిలుస్తూ..నేను జిల్లా కలెక్టర్​ను వచ్చా నంటూ ఆ విద్యార్థి చదువు విషయం గురించి ఆరాతీశాడు. పదో తరగతి విద్యార్థికి మైలురాయి అంటూ యాదాద్రి  భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.  ఆ విద్యార్థి చదువుకునేందుకు వీలుగా.. ఒక చైర్, రైటింగ్ పాడ్ గిఫ్ట్ గా ఇచ్చారు. 

Also Read :- స్థిరంగా బంగారం ధరలు..ఇవాళ (ఫిబ్రవరి6) ఎంతంటే

అనంతరం విద్యార్థి తల్లి దండ్రులతో ముచ్చటించి.. ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీసిన కలెక్టర్​ పదో తరగతి పరీక్షలు అయ్యేంత వరకు  ప్రతి నెల రూ. 5 వేలు ఆర్థిక సాయం చేస్తానని ఫిబ్రవరి నెల సాయాన్ని అందించారు. కలెక్టర్​ మాటలతో తనకు ఆత్మ విశ్వాసం పెరిగిందని...  బాగా చదివి పోలీస్​ ఆఫీసర్​ అవుతానని ధీమాగా విద్యార్థి భరత్​ చంద్ర కలెక్టర్​కు తెలిపాడు.  కలెక్టర్ స్వయంగా ఇంటికి రావటం నమ్మలేక పోతున్నామంటూ విద్యార్థి  కుటుంబ సభ్యుల ఆనందం వ్యక్తం చేశారు.