మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మెట్పల్లికి చెందిన రాచకొండ యాదగిరిబాబు నియమితులయ్యారు. ఈయన గతంలో మెట్పల్లి ప్రధాన కార్యదర్శిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. తాజాగా జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా నియమితులు కావడంపై బీజేపీ లీడర్లు హర్షం వ్యక్తం చేశారు.