
- వృద్ధ దంపతులపై దాడి ఘటనలో యాదయ్య పరిస్థితి సీరియస్
- నిమ్స్కు తరలించి ట్రీట్మెంట్
- ఎంపీటీసీ భర్త, మరిదిపై హత్యాయత్నం కేసు.. రిమాండ్
చేవెళ్ల, వెలుగు: వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం పులుమామిడి గ్రామంలో వృద్ధ దంపతులపై దాడి ఘటనలో గాయపడిన తెలుగు యాదయ్య పరిస్థితి సీరియస్గా ఉంది. ప్రస్తుతం నిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. భరతమ్మ వికారాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నది. ఈ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ కావడంతో.. వృద్ధ దంపతుల కోడలు తెలుగు గాయత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి వివరాలు మీడియాకు వివరించారు.
టీఆర్ఎస్ ఎంపీటీసీ తేజస్వీ భర్త సోమనోళ్ల రామక్రిష్ణా రెడ్డి, అతని సోదరుడు సోమనోళ్ల శ్రీనివాస్రెడ్డిపై హత్యాయత్నం కింద కేసు ఫైల్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. కాగా, పోలీసుల వైఖరిపై ముదిరాజ్ సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మండిపడ్డారు. ఎంపీటీసీ తేజస్విపైనా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, సోమవారం నలుగురిపై కేసు ఫైల్ చేశామన్న పోలీసులు.. ఇపుడు ఇద్దరిపై కేసు నమోదు చేశామని చెప్పుడేందని విమర్శించారు. నలుగురిపై కేసు పెట్టి.. పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ఐను సస్పెండ్ చేయాలని కోరారు.