
కొమురవెల్లి, వెలుగు: కొమురెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలోని నిత్యాన్నదాన సత్రానికి వరంగల్ కు చెందిన యశ్పాల్ సోనియా రూ.4 లక్షల వ్యయంతో వాటర్ ప్యూరిఫయర్ యంత్రాన్ని బహూకరించారు.
గురువారం ఈవో బాలాజీ వాటర్ఫ్యూరిఫైడ్యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు దాత దంపతులకు స్వామివారి లడ్డు ప్రసాదం అందించి ఘనంగా సన్మానించారు.