AP Liquor scam: ముగిసిన వైసీపీ ఎంపీ మిథునరెడ్డి సిట్​విచారణ

AP Liquor scam: ముగిసిన  వైసీపీ ఎంపీ మిథునరెడ్డి సిట్​విచారణ

ఏపీ లిక్కర్​ స్కాంలో వైసీపీ  ఎంపీ మిథున్​రెడ్డి సిట్​ విచారణ ఈ రోజు ( ఏప్రిల్​ 19) ముగిసింది.  ఏడుగంటలపాటు విచారించిన సిట్​ అధికారులు ఆయన స్టేట్​ మెంట్​ ను రికార్డ్​ చేశారు.   పలు అంశాలపై మిథునరెడ్డికి ప్రశ్నల వర్షం కురిపించి.. కీలక సమాచారాన్ని రాబట్టారని సమాచారం అందుతోంది.  ఈ  వ్యవహారంలో ఆయనను మళ్లీ సిట్​ విచారణకు పిలిచే అవకాశం ఉంది.

వైసీపీ ఎంపీ మిథున రెడ్డిని కోర్టు ఆదేశాల మేరకు ఆయన న్యాయవాది సమక్షంలో విచారించారు.  రాజ్​ కసిరెడ్డి ఆడాన్​ డిస్టిలరీపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం అందుతోంది.   ఏపీ బేవరేజస్​ కార్పొరేషన్​ ఎంత మేరకు కొనుగోళ్లు చేసిందని ప్రశ్నించారు. రాజ్​ కసిరెడ్డితో ఉన్న ఆర్థికలావాదేవీల గురించి ఆరాతీశారు.