ఏచూరి మరణం CPM పార్టీకి తీరని లోటు: నాగయ్య

ఏచూరి మరణం CPM పార్టీకి తీరని లోటు:  నాగయ్య

ఖిలావరంగల్, వెలుగు: సీతారాం ఏచూరి మరణం పార్టీకి తీరని లోటని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య అన్నారు. శనివారం సీపీఎం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభను సీపీఎం నాయకులు రంగయ్య అధ్యక్షతన ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సమావేశంలో సింగార బాబు, నలిగంటి రత్నమాల, భూక్య సమ్మయ్య,ఈసంపల్లి బాబు, కోరబోయిన కుమార్, స్వామి పాల్గొన్నారు.