వక్ఫ్​ సవరణ చట్టం ముస్లింలకే లాభం : యెండల లక్ష్మీనారాయణ

వక్ఫ్​ సవరణ చట్టం ముస్లింలకే లాభం  : యెండల లక్ష్మీనారాయణ
  • బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ

వర్ని, వెలుగు : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్​బోర్డు సవరణ చట్టం ముస్లింలకే లాభమని బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం రుద్రూర్​ మండల కేంద్రంలో నిర్వహించిన గావ్​చలో బస్తీ చలో కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  గతంలో 2006 లో వక్ఫ్​బోర్డు ఆదాయం రూ.12 వేల కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.163 కోట్ల ఆదాయం చూపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

వక్ఫ్​బోర్డు లో నెలకొన్న అవినీతిని ప్రక్షాళన చేసేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్​బోర్డు సవరణ చట్టం తీసుకొచ్చిందన్నారు. రుద్రూర్​ లోని అంగడిబజార్​లోని అంబేద్కర్​ విగ్రహానికి జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్​ మెంబర్​ ప్రశాంత్​గౌడ్​, మండలాధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి వడ్లసాయినాథ్​, బీసీ మోర్చా అధ్యక్షుడు సతీష్​పవర్​ తదితరులు పాల్గొన్నారు.