
హైదరాబాద్: జగిత్యాలలో వృద్దుని బ్యాంక్అకౌంట్ నుంచి పెన్షన్ డబ్బులను యువకుడు కాజేసిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. జగిత్యాల గాంధీనగర్కు చెందిన SRSP రిటైర్ట్ ఉద్యోగి లక్ష్మణ్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రిటైర్ట్ ఉద్యోగి లక్ష్మణ్కు ప్రతినెల రూ. 48 వేల పెన్షన్ బ్యాంకులో జమ అవుతుంది. ఆదే కాలనీకి చెందిన తిరుపతి అనే యువకుడు ఫోన్నంబర్ వృద్ధుని అకౌంట్కి నమోదు చేసుకున్నాడు. తిరుపతి ఫోన్ఫో ద్వారా ఇప్పటివరకు రూ. 18 లక్షల డ్రా చేసుకున్నాడు. ఏండ్ల నుంచి అనుమానం రాకుండా ప్రతినెల రూ. 20 వేల వృద్ధుడి అకౌంట్నుంచి డ్రా చేసిన్నట్లుగా గుర్తించారు. న్యాయం చేయాలని వృద్ధ దంపతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.