క్రికెట్ ​ఆడుతూ కుప్పకూలిన యువకుడు

క్రికెట్ ​ఆడుతూ కుప్పకూలిన యువకుడు
  • హాస్పిటల్​కు​ తరలించగా, అప్పటికే మృతి చెందాడన్న డాక్టర్లు
  • మేడ్చల్‌‌‌‌ జిల్లాలో ఘటన

కీసర, వెలుగు: మేడ్చల్‌‌‌‌ జిల్లా కీసరలో క్రికెట్​ఆడుతూ ఉన్నట్టుండి ఓ యువకుడు మృతి చెందాడు. ఓల్డ్ బోయినపల్లికి చెందిన ప్రణీత్ (32) కెనరా బ్యాంక్​లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం తన ఫ్రెండ్స్​తో కలిసి క్రికెట్ ఆడడానికి రాంపల్లి దయారాలోని త్యాగి స్పోర్ట్స్​గ్రౌండ్ కు వెళ్లాడు. 

క్రికెట్​ ఆడుతూ ఒక్కసారిగా కింద కుప్పకూలాడు. గమనించిన స్నేహితులు బాధితుడిని సమీప హాస్పిటల్​కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గుండె పోటుతో చనిపోయి ఉండొచ్చని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

ప్రణీత్​ డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్​గాంధీ దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కెనరా బ్యాంక్​లో పనిచేసిన ప్రణీత్ ​తండ్రి జగదీశ్ ​కొన్ని నెలల కిందటే చనిపోయాడు. ఇప్పుడు కొడుకు ఆకస్మిక మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.