
- మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో విషాదం
కోల్ బెల్ట్,వెలుగు: జాబ్ లేకుండా ప్రేమ పెండ్లి చేసుకుంటే పోషించలేమోనని మనస్తాపానికి లోనైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. రామకృష్ణాపూర్టౌన్ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన ప్రకారం.. భూపాలపల్లి జిల్లా కొయ్యూరు మండలం గంగరాం గ్రామానికి చెందిన బొమ్మన సంతోషిణి కొడుకు వినయ్రెడ్డి(20), రామకృష్ణాపూర్టౌన్ అబ్రహంనగర్లో తాత లింగారెడ్డి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు.
క్యాటరింగ్పనులకు కూడా వెళ్తుంటాడు. కొన్నాళ్లుగా అదే ఏరియాకు చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండడంతో యువకుడు తమ కుటుంబసభ్యులకు తెలిపాడు. జాబ్ లేకపోవడంతో పెండ్లి చేసుకుంటే ఎట్లా పోషించాలని మనస్తాపానికి లోనైన వినయ్శనివారం ఉరేసుకుని చనిపోయాడు. మృతుడి తల్లి సంతోషిణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.