
- పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘటన
గోదావరిఖని, వెలుగు: కాంపిటీటివ్ పరీక్షలు రాసినా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురై పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్హౌస్ కాలనీకి చెందిన చుంచు ప్రత్యూష(25) ఆత్మహత్య చేసుకుంది. గోదావరిఖని వన్టౌన్ ఎస్సై భూమేశ్, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని బస్టాండ్ ఏరియా వద్ద హోటల్ నిర్వహించే విఠల్కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ప్రత్యూష చిన్న కూతురు కాగా, పీజీ వరకు చదివిన ఆమె గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు బ్యాంక్ జాబ్ కోసం పలుమార్లు పరీక్షలు రాసింది.
ఉద్యోగాలు రాకపోవడంతో మానసికంగా కుంగిపోయిన ప్రత్యూష మంగళవారం రాత్రి తన ఇంట్లో చీరతో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతురాలి తండ్రి విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యూష కండ్లను సదాశయ ఫౌండేషన్ ద్వారా సేకరించి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు.