బస్సు చక్రాల కింద నలిగిపోయిన యువతి.. కొత్తగూడ చౌరస్తాలో ఘటన

బస్సు చక్రాల కింద నలిగిపోయిన యువతి.. కొత్తగూడ చౌరస్తాలో ఘటన

ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ చౌరస్తాలో చోటుచేసుకుంది. యువతి రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దాంతో, యువతి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది.   

ALSO READ : బిగ్ బ్రేకింగ్: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం.

సీసీటీవీ ఫుటేజ్

యువతిని బస్సు ఢీకొన్న సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది. అందులో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపారని స్పష్టంగా తెలుస్తోంది. నాలుగు రోడ్ల కూడలి కావడంతో ప్రయాణికులు ఒక్కొక్కరిగా రోడ్డు దాటుతున్నారు. అందరిలానే యువతి రోడ్డు దాటుతోంది. వెనుక బస్సు వస్తున్న విషయాన్ని యువతి అతి సమీపంగా వచ్చేవరకూ గుర్తించేలేదు. చివరకు చేయి పైకెత్తి డ్రైవర్‌ను అప్రమత్తం చేసే టప్పటికే.. బస్సు మీదుగా దూసుకెళ్ళిపోయింది. యువతి బస్సు చక్రాల కింద ప్రాణాలు విడిచింది. యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.