
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చదువుకున్న యువత ఎక్కువగా ఉన్నప్పటికీ, హెల్త్ విషయంలో మాత్రం వెనకబడుతున్నారు. ఆరోగ్యానికి సంబంధించి సరైన అవగాహన లేకపోవడంతో చిన్న వయసులోనే రోగాల బారినపడుతున్నారు. రాష్ట్రంలో 15–24 ఏండ్ల వయసున్న వారిలో 97 శాతం లిటరసీ రేటు ఉన్నట్టు సోషియో ఎకనామి ఔట్లుక్లో ప్రభుత్వం వెల్లడించింది. అబ్బాయిల్లో 98.16%, అమ్మాయిల్లో 95.48% మంది చదువుతో ముందున్నారు.
కానీ ఈ చదువుకున్న యువతకు ఆరోగ్యం విషయంలో అవగాహన మాత్రం తక్కువేనని తాజా నివేదికలు చెబుతున్నాయి. హెచ్ఐవీ, హైపర్ టెన్షన్, ఊబకాయం, డయాబెటీస్, డి విటమిన్లోపం లాంటి సమస్యలు వీళ్లలోనే ఎక్కువగా వస్తున్నాయి. స్కూళ్లలో, కాలేజీల్లో ఆరోగ్యం గురించి సరైన ఎడ్యుకేషన్ లేదని, కనీస అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతోనే ఈ సమస్య వస్తున్నదని నిపుణులు చెబుతున్నారు.
యువత లైఫ్ స్టైల్మారడం, ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ సేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఆరోగ్యం గురించి సరైన ఎడ్యుకేషన్లేకపోవడం, చదువుకున్నోళ్లైనా రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేయించుకోకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమస్యలు వస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.
దీంతో స్కూళ్లు, కాలేజీల్లో హెల్త్ఎడ్యుకేషన్పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సర్కార్ యోచిస్తున్నట్టు తెలిసింది. పాఠశాలల్లోనే పిల్లలకు నేర్పించేలా ప్లాన్చేస్తున్నది. టీశాట్లాంటి డిజిటల్ చానెళ్లతో గ్రామీణ యువతకూ అవగాహన కల్పించాలనుకుంటున్నది. గ్రామీణ ఏరియాల్లో మొబైల్ హెల్త్ క్యాంప్లు, ఫ్రీ చెకప్లు నిర్వహించాలని భావిస్తున్నది.
74% యువతకు హెచ్ఐవీపై అవగాహన లేదు..
హెచ్ఐవీ గురించి కూడా యువతలో సరైన అవగాహన లేదు. రాష్ట్రంలో 74% యువతకు హెచ్ఐవీ గురించి పూర్తి అవగాహన లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.3 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. చదువుకున్న యువత కూడా సురక్షిత సెక్స్, రెగ్యులర్ టెస్టింగ్ గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య వచ్చినట్టు తెలిసింది.
ఇక కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్చేసిన శాంపిల్టెస్టుల అనాలసిస్లోనూ యూత్వేగంగా వివిధ రోగాల బారిన పడుతున్నట్లు స్పష్టమవుతున్నది. 25 లక్షల మంది ఆరోగ్య పరీక్షల ఆధారంగా తెలంగాణ యువత సమస్యలను అపోలో హాస్పిటల్స్ 2025 నివేదిక బయటపెట్టింది.
కాలేజీ విద్యార్థుల్లో 28% మందికి ఊబకాయం
కాలేజీ విద్యార్థుల్లో 28% మంది ఊబకాయంతో బాధపడుతున్నట్టు ఇందులో తేలింది. 19% మంది యువత బీపీతో బాధపడుతున్నారు. డయాబెటిస్ అంటే 40 ఏండ్లు, 50 ఏండ్లు ఆ తరువాత అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు పాఠశాల, కాలేజీ స్థాయిలోనే అంటే 30 ఏండ్లలోపు అది కూడా చదువుకున్న యువతలో ముఖ్యంగా హైదరాబాద్లో షుగర్ కేసులు పెరుగుతున్నాయి.
రాష్ట్రంలో 81% యువతకు విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనమవుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. హైదరాబాద్లో 45 ఏళ్లు పైబడిన వాళ్లలో కేవలం 20% మందికే డిజిటల్ హెల్త్ గురించి తెలుసు. కానీ 98% మంది చదువుకున్న యువత హెల్త్ యాప్లు, టెలిమెడిసిన్ సులభంగా వాడగలరు. అయితే వీళ్లు ఈ అవకాశాలను ఎక్కువగా వినియోగించుకోవడం లేదని వెల్లడైంది.