గోదావరిఖనిలో యువకుల వీరంగం.. ఏం జరిగిందంటే

గోదావరిఖనిలో యువకుల వీరంగం.. ఏం జరిగిందంటే

పెద్దపల్లి జిల్లాలో యువకులు వీరంగం సృష్టించారు.  గోదావరిఖని  సింగరేణి స్టేడియంలో దసరా ఉత్సవాలు జరిగాయి.   ఈ సంబరాల్లో పాల్గొన్న యువకులు డ్యాన్స్​లు చేస్తూ సందడి చేశారు.  కారణం తెలియరాలేదు కాని.. కొంతమంది యువకులు కొట్టుకున్నారు.  పిడిగుద్దులు.. కాళ్లతో తన్నుకుంటూ నానా హంగామా చేశారు.  అక్కడున్న వారు కొంతమంది ఈ ఘటనను వీడియో రికార్డ్​ చేసి సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేశారు.  స్టేడియం చుట్టూ పోలీసులు ఉన్నా ... ఈ గొడవ జరగడంతో అక్కడికి వచ్చిన జనం భయాందోళనకు గురయ్యారు. ఈ గొడవకు సంబంధించిన పూర్తివివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  .