గంజాయి మత్తులో యువకుల వీరంగం...

గంజాయి మత్తులో యువకుల వీరంగం...

హైదరాబాద్ లో ఇద్దరు యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. గణేష్ మండపం దగ్గర మద్యం గంజాయి సేవించిన యువకులు కొండాపూర్ లోని హిందూ జై గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులపై దాడికి పాల్పడ్డారు.

మంగళవారం ( సెప్టెంబర్ 17, 2024 ) రాత్రి చోటు చేసుకుంది ఈ ఘటన. మద్యం,గంజాయి సేవించి మత్తులో కత్తులు,కర్రలతో విరంగం సృష్టించారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలవ్వగా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దాడికి పాల్పడ్డ వారిని బంజారాహిల్స్ కు చెందిన చందు ఫైల్వాన్,రణదీప్ గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.