బాబు పాలనలో దోచుకో, పంచుకొని తిను అన్నట్టే ఉంది: వైఎస్‌ జగన్‌

బాబు పాలనలో దోచుకో, పంచుకొని తిను అన్నట్టే ఉంది: వైఎస్‌ జగన్‌

చంద్రబాబు పాలనలో డీపీటీ మాత్రమే కనిపిస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి పాలనలో డీపీటీ అంటే దోచుకో.. పంచుకో.. తినుకో అన్న చందంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టలేకపోయిందని, ఓటాన్‌ అకౌంట్‌తో ఇన్నాళ్లు నడిచే ప్రభుత్వం ఎక్కడా లేదని విమర్శలు గుప్పించారు. 

ప్రభుత్వం ఏర్పడి అయిదు నెలలు గడుస్తున్నా సూపర్‌ 6 లేదు, సూపర్‌ 7 లేదని దుయ్యబట్టారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ శుక్రవారం మాట్లాడుతూ.. ప్రజలు నిలదీస్తారని భయపడి, కనీసం బడ్జెట్‌ ప్రవేశ పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. బడ్జెట్‌ ప్రవేశపెడితే సూపర్‌-6 ఎక్కడ అని ప్రజలు అడుగుతారని భయం బాబును వెంటాడుతుందని అన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మాదిరి.. బాబు అయిదు నెలల్లో డీబీటీ ఎక్కడా కనిపించలేదని పేర్కొన్నారు.