
డీలిమిటేషన్ పై ప్రధాని మోడీకి లేఖ రాసారు వైసీపీ అధినేత జగన్. 2026లో డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఉందని.. ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ఆందోళన దక్షిణాది రాష్ట్రాల్లో ఉందని పేర్కొన్నారు జగన్. గత 15ఏళ్లలో దక్షిణాదిలో జనాభా తగ్గిందని.. ఇందుకు కారణం గతంలో కేంద్రం పిలుపునిచ్చిన జనాభా నియంత్రణ అని అన్నారు జగన్.ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయని, డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా చూడాలని లేఖలో ప్రధాని మోడీని కోరారు జగన్.
ఇదిలా ఉండగా.. ఇవాళ ( మార్చి 22 ) తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో డీలిమిటేషన్ పై ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు.
ఈ మీటింగ్ లో తెలంగాణ కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం వేర్వేరుగా హైదరాబాద్ నుంచి బయలుదేరి చెన్నై వెళ్లారు సీఎం రేవంత్, మహేష్ కుమార్ గౌడ్.
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి దక్షిణాదికి అన్యాయం చేయాలని మోదీ సర్కార్ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు మండిపడ్తున్నాయి. ఈ అంశంపై ఆల్పార్టీ మీటింగ్లో విస్తృతంగా చర్చించారు. బీఆర్ఎస్ తరపున కేటీఆర్, పలువురు మాజీ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.