
వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ అబ్ధుల్ నజీర్తో భేటీ అయ్యారు. రాజ్భవన్కు వెళ్లి, గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్.. టీడీపీ అరాచకాలపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను వైఎస్ జగన్.. రాష్ట్ర గవర్నర్కు వివరించారు. ఏపీలో 45 రోజులుగా జరుగుతున్న దాడులు, హత్యల గురించి ఫిర్యాదు చేశారు. దాడులకు సంబంధించిన ఫొటోలను, వీడియోలు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు జగన్ చూపించారు. వినుకొండలో పార్టీ కార్యకర్తను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ మర్నాడే పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం సహా, ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్కు వైఎస్ జగన్ అందజేశారు. ఈ భేటి 45 నిమిషాలు జరిగింది.