రషీద్​ కుటుంబాన్ని ఓదార్చిన జగన్​

రషీద్​ కుటుంబాన్ని ఓదార్చిన జగన్​

పల్నాడు జిల్లాలో ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ పర్యటించారు.వినుకొండలో ఆయన పర్యటప సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు.  ఎలాంటి ఘటనలు జరగకుండా 144 సెక్షన్​ విధించారు. వినుకొండలో రషీద్​ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. రెండు రోజుల క్రితం వైసీపీ కార్యకర్త రషీద్​ ను హత్య చేశారు.  బాధిత కుటుంబాన్ని ఓదార్చిన  జగన్​ ... రషీద్​ చిత్రపటానికి నివాళులు అర్పించారు. హత్య ఎలా జరిగిందో జగన్​ రషీద్​ తల్లి దండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో జరుగుతున్న దాడుల విషయంలో ప్రధాని మోదీని కలుస్తామన్నారు. త్వరలో ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు.

టీడీపీ నాయకులతో నిందితుడు జిలానీ ఉన్న ఫొటోలను రషీద్​ తల్లిదండ్రులు జగన్​ కు చూపించారు.  ఇంకా తమను బెదిరిస్తున్నారని రషీద్​ తల్లిదండ్రులు జగన్​కు వివరించారు. జిలానీ ఫోన్​ కాల్​ రికార్డ్​ బయటకు తీస్తే హత్య వెనుక  ఉన్నారో తెలుస్తుందన్నారు. రాజకీయ కక్షతో తమ కొడుకును బలి తీసుకున్నారని రషీద్​ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రధాన నిందితుల పేర్లు ఎఫ్​ఐఆర్​ లోచేర్చలేదని.. ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి పేరు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని రషీద్​ కుటుంబసభ్యులు జగన్​ కు వివరించారు. రషీద్​ కుటుంబానికి అండగా ఉంటామన్నారు జగన్​.