
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఐదు విడతలుగా ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల ఇంఛార్జీలను ప్రకటించిన వైఎస్సార్సీపీ తాజాగా శుక్రవారం(ఫిబ్రవరి 2) ఆరో జాబితా విడుదల చేసింది. నాలుగు పార్లమెంట్ స్థానాలు, 6 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన జాబితాను మంత్రి మేరుగ నాగార్జున, సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఇప్పటికే ఐదు జాబితాలో దాదాపు అన్ని నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించారు సీఎం వైస్ ఎస్ జగన్.
ఎంపీ స్థానాలు- ఇంఛార్జీలు
- నర్సాపురం(ఎంపీ)- అడ్వకేట్ ఉమాబాల
- చిత్తూరు (ఎంపీ) - ఎన్ రెడ్డప్ప
- గుంటూరు (ఎంపీ)- ఉమ్మారెడ్డి వెంకటరమణ
- రాజమండ్రి(ఎంపీ) - గూడూరు శ్రీనివాస్
ఎమ్మెల్యే స్థానాలు- ఇంఛార్జీలు
- నెల్లూరు సిటీ - ఎండీ ఖలీల్
- మైలవరం - తిరుపతి రామ్ యాదవ్
- మార్కాపురం - అన్నా రాంబాబు
- ఎమ్మిగనూరు - బుట్టా రేణుక
- గిద్దలూరు- కే. నాగార్జునరెడ్డి
- మైలవరం- సర్నాల తిరుపతిరావు యాదవ్
- జీడీ నెల్లూరు - కె. నారాయణ స్వామి
వైఎస్సార్ సీపీ 6వ జాబితా విడుదల...
— YSR Congress Party (@YSRCParty) February 2, 2024
నాలుగు పార్లమెంట్ స్థానాలు, ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబందించి జాబితాను మంత్రి మేరుగ నాగార్జున,సజ్జల రామకృష్ణ రెడ్డి విడుదల చేశారు.#YSJaganAgain#Siddham pic.twitter.com/asgTtiOE18