ధాన్యం కొనుగోలు కేంద్రాలను  సద్వినియోగం చేసుకోవాలి : జడ్పీ సీఈవో చందర్​ నాయక్​ 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను  సద్వినియోగం చేసుకోవాలి : జడ్పీ సీఈవో చందర్​ నాయక్​ 

సదాశివనగర్, వెలుగు: సొసైటీల ద్వారా ప్రభుత్వం ధాన్యం​ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని మండల ప్రత్యేక అధికారి, జిల్లా పరిషత్​ సీఈవో  చందర్​ నాయక్​ అన్నారు. బుధవారం సదాశివనగర్​ సొసైటీ పరిధిలోని ధర్మారావుపేట్, తిర్మన్​పల్లి, సదాశివనగర్​ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్​ కమలాకర్​రావుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  గ్రేడ్​‘ ఏ’ రకం ధాన్యానికి  మద్దతు ధర రూ.2320, సాధారణ రకానికి రూ. 2300 ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.   కార్యక్రమంలో సీఈవో విఘ్నేష్​గౌడ్, ఎంపీడీవో సంతోశ్​ కుమార్, తహసీల్దార్​ గంగాసాగర్, ఏఈవో కవిత, బద్దం శ్రీనివాస్​రెడ్డి, గాదారి శ్రీనివాస్​ రెడ్డి, వడ్ల రాజేందర్, మధుసూదన్​రెడ్డి, జనగామ రాజు, కోతి లింగారెడ్డి, కొప్పుల నర్సారెడ్డి, బాబాయ్య, బాల్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మోడెగామ, పద్మాజివాడి, మల్లుపేట్​లో.. 

సదాశివనగర్​ మండలం పద్మాజివాడి సొసైటీ పరిధిలోని పద్మాజివాడి, మోడెగామ, మల్లుపేట్​ గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్​గంగాధర్​ ప్రారభించారు.  కార్యక్రమంలో వైస్​ చైర్మన్​ కుంట శ్రీనివాస్​ రెడ్డి, సీఈవో దేవేందర్​రావు, ఏఈవో గాయత్రి, భరత్​రెడ్డి, డైరెక్టర్లు,  రైతులు తదితరులు
పాల్గొన్నారు. 

బైరాపూర్​లో సోసైటీ ఆధ్వర్యంలో..

బీర్కూర్, వెలుగు: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ర్ట ఆగ్రో ఇండస్ర్టీస్​ చైర్మన్​కాసుల బాల్​రాజ్​అన్నారు.  బుధవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్​మండలం బైరాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కాసుల బాల్​రాజ్​మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు.

 ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి అందించే బోనస్ పొందాలని, దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు.  బీర్కూర్​ సొసైటీ ఆధ్వర్యంలో చించెల్లి, కిష్టాపూర్​, నస్రుల్లాబాద్​ మండలం మైలారం సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా సొసైటీ చైర్మన్లు గాంధీ, హనుమంత రావుల ఆధ్వర్యంలో ప్రారంభించారు.