
మాదాపూర్, వెలుగు: ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తను పనిచేయాల్సిన పోస్టులో కాకుండా కింది స్థాయి పోస్టులో పని చేయాలని కోరుకోరు. ఒక మెట్టుపైకి ఎక్కిన తర్వాత మళ్లీ కింది పోస్టుకు వెళ్లాలనుకోరు. జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని చందానగర్ సర్కిల్టౌన్ప్లానింగ్లో ఇద్దరు ఉద్యోగులు మాత్రం తాము పనిచేయాల్సిన పోస్టులో కాకుండా కింది స్థాయి సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. సిబ్బంది లేరనే సాకుతో జోనల్కమిషనర్, సర్కిల్డిప్యూటీ కమిషనర్లు ఆ ఇద్దరు ఉద్యోగులను చైన్మెన్లుగా కొనసాగిస్తుండడం గమనార్హం.
చేయాల్సింది ఒకటి.. చేస్తున్నది మరొకటి
శేరిలింగంపల్లి జోన్పరిధిలోని నాలుగు సర్కిళ్ల టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న చైన్మెన్లను 2024 అక్టోబర్ 21న జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి ట్రాన్స్ఫర్ చేశారు. అదే టైంలో శేరిలింగంపల్లి సర్కిల్లో పనిచేస్తున్న రికార్డ్అసిస్టెంట్జావీద్, పటాన్చెరు సర్కిల్లో పనిచేస్తున్న రికార్డ్అసిస్టెంట్రాజేందర్చందానగర్సర్కిల్టౌన్ ప్లానింగ్విభాగానికి బదిలీపై వచ్చారు.
ఈ ఇద్దరూ తమకు కేటాయించిన విభాగంలో రికార్డులను పరిశీలిస్తూ, ఆఫీసర్ల ఆదేశానుసారం వారికి కావాల్సిన రికార్డులను అందజేస్తూ ఆఫీస్లోనే ఉండాలి. కానీ చైన్మెన్లుగా ఫీల్డ్లో తిరుగుతున్నారు. జీతం మాత్రం రికార్డు అసిస్టెంట్ పోస్టుదే తీసుకుంటున్నారు. చైన్మెన్జీతం రూ.30 నుంచి రూ.40 వేల మధ్య ఉంటే వీరు చైన్మెన్లుగా జాబ్చేస్తూ ఒకరు రూ.85 వేలు, మరొకరు రూ.55వేలు తీసుకుంటున్నారు.
అక్రమ నిర్మాణాల అడ్డా..
ఈ సర్కిల్పరిధిలోని మాదాపూర్ డివిజన్ అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ఇండియా, అగర్వాల్లే అవుట్, చంద్రనాయక్తండా, మియాపూర్లోని100,101, 44 సర్వే నంబర్లలోని వివాదాస్పద భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా బిల్డర్లు భారీ నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
వీటిని అడ్డుకోవాల్సిన ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి చూడడం లేదని తెలుస్తోంది. ఇంతకుముందు కూడా ఈ సర్కిల్టౌన్ప్లానింగ్విభాగంలో టీపీఎస్, చైన్మెన్లను పనిచేసిన వారిని ఉన్నతాధికారులు ఆరు నెలల్లో రెండు సార్లు మార్చారు. అయినా, ఇంకా ఆరోపణలు వినవిస్తూనే ఉన్నాయి.