CMRF: నీది ఏ పార్టీ, ఎవరికి ఓట్లు వేశావు, చెక్కు లేదు పో: ZTPTC

CMRF: నీది ఏ పార్టీ, ఎవరికి ఓట్లు వేశావు, చెక్కు లేదు పో: ZTPTC

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీలో వికారాబాద్ జిల్లా దోమ మండల జడ్పీటీసీ నాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు తీసుకునేందుకు వెళ్ళిన పెంటారెడ్డి అనే బాధితుడిపై దుర్భాషలాడాడు. నీది ఏ పార్టీ, ఎవరికి ఓట్లు వేశావు, చెక్కు లేదు ఏం లేదంటూ ఇంట్లో నుండి గెంటేశాడు. దోమ మండలం గూడూరుకు చెందిన పెంటారెడ్డి అనే రైతు గొంతు క్యాన్సర్‭తో బాధపడుతున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పెంటారెడ్డి ఎకరం పొలం అమ్మి వైద్యం చేయించుకున్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత ఆర్థిక సహాయం అందుతుందని పరిగి ఎమ్మెల్యేకు ధరఖాస్తు చేసుకోగా రూ.60 వేల ఆర్థిక సహాయం మంజూరైంది.

ఈ క్రమంలో దోమ మండల జడ్పీటీసీ నాగిరెడ్డి పరిగిలోని తన నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశాడు. పెంటా రెడ్డి కూడా తన చెక్కు తీసుకునేందుకు తన కొడుకుతో కలిసి నాగిరెడ్డి ఇంటికి వెళ్ళగా.. అతడు బాధితుడితో దురుసుగా ప్రవర్తించాడు. తమకు చెక్కు ఇవ్వకుండానే ఇంట్లో నుండి గెంటేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.