
సదాశివనగర్, వెలుగు : సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్లో సోమవారం కొత్త అంగన్ వాడి బిల్డింగ్ ను జడ్పీటీసీ కమిలీ నర్సింహులు, ఎంపీపీ అనసూయ తో కలిసి ప్రారంభించారు. అంగన్ వాడి సెంటర్లలో పిల్లల కోసం సర్కార్ నిధులు మంజూరు చేయడంతో కొత్త బిల్డింగ్ లను కట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఏలేటి స్వరూప భూంరెడ్డి, సీడీపీవో శ్రీలత, సూపర్ వైజర్ పద్మ, అంగన్ వాడి టీచర్లు అనిత పాల్గొన్నారు.