బైడెన్ సర్కార్‎పై జుకర్ బర్గ్ సంచలన ఆరోపణ

బైడెన్ సర్కార్‎పై జుకర్ బర్గ్ సంచలన ఆరోపణ

వాషింగ్టన్: కరోనా కంటెంట్‎ను తొలగించాలని బైడెన్ సర్కారు తమను ఒత్తిడి చేసిందని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఆరోపించారు. ప్రభుత్వ డిమాండ్లకు తలొగ్గినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నానని ఆయన తెలిపారు. కొవిడ్ 19 కంటెంట్‎పై సెన్సార్ విధించుకోవాలని 2021లో వైట్​హౌస్‎తో పాటు బైడెన్ అడ్మినిస్ట్రేషన్‎కు చెందిన సీనియర్ అధికారులు మా కంపెనీ ప్రతినిధులను అదేపనిగా ఒత్తిడి చేశారని ఆయన వెల్లడించారు. 

ఈమేరకు అమెరికా ప్రతినిధుల సభకు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వం తమ కంపెనీ బృందాలను అలా ఒత్తిడికి గురిచేయడం కరెక్టు కాదని, ఈ విషయంపై ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేనని జుకర్ బర్గ్ పేర్కొన్నారు. కాగా.. కరోనా మహమ్మారికి సంబంధించిన లాక్ డౌన్, వ్యాక్సిన్లు, మాస్కుల ధారణ వంటి కంటెంట్‎ను తొలగించినందుకు ఫేస్ బుక్ అధికారులపై అప్పుడు విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం ఒక్క ఏడాదిలోనే 2 కోట్ల కాపీలను ఫేస్ బుక్  తొలగించింది.