
కార్తికేయ, నేహాశెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బెదురులంక 2012’. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించారు.
‘ఇప్పటికే విడుదలైన ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక’ గ్లింప్స్, ‘వెన్నెల్లో ఆడపిల్ల’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా ఇది. 2012 యుగాంత ప్రచారం బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లడంతో పాటు ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు దర్శక నిర్మాతలు.
అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కశిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.